Share News

శేషయ్యగారిపల్లెలో తాగునీటి పైపులైను ఏర్పాటు

ABN , Publish Date - Sep 17 , 2024 | 12:45 AM

మండలంలోని శేషయ్యగారిపల్లెలో నాలుగు రోజుల క్రి తం ఎక్సకవేటరుతో తొలగించిన పైపులైను పునరుద్ధరించారు.

శేషయ్యగారిపల్లెలో తాగునీటి పైపులైను ఏర్పాటు
శేషయ్యగారిపల్లెలో తొలగించిన పైపులైన్లను తిరిగి ఏర్పాటు చేస్తున్న దృశ్యం

చెన్నూరు, సెప్టెంబరు 16 : మండలంలోని శేషయ్యగారిపల్లెలో నాలుగు రోజుల క్రి తం ఎక్సకవేటరుతో తొలగించిన పైపులైను పునరుద్ధరించారు. కొప్పర్తి పరిశ్రమకు పెన్నానది నుంచి తాగునీటి పైపులైను ఏర్పాటు చేస్తున్నారని, ఈ పైపులైను మండలంలోని శేషయ్యగారిపల్లె గుండా హైవే రహదారి పక్క నుంచి వెళుతోందని, అయితే పైపులైను గుంతల కోసం ఎక్సకవేటరుతో తొలగించడం జరిగింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతిలో రావడంతో ఎమ్మె ల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డిస్పందించి ఎక్సకటేరుతో పైపులలైను తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తాగునీటి పైపులైను ప నులు తిరిగి పునరుద్దరించి ఇబ్బందులు లేకండా చూ డాలని తెలిపారు. అంతేకాక గ్రామప్రజలకు పైపులైను పనులు పూర్తి చేసేంత వరకు కొప్పర్తి పరిశ్రమ కోసం ఎలాంటి పనులు చేయరాదన్నారు. ఎమ్మెల్యే ఆదేశించడంతో సోమవారం ఉదయంకల్లా పైపులైను పనులు పూర్తి చేసి తిరిగి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయడంతో ఆ గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 17 , 2024 | 07:45 AM