Share News

గంజాయి కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

ABN , Publish Date - Sep 28 , 2024 | 11:40 PM

గంజాయి కేసు లో ప్రఽధాన నిందితుడు మౌలాలి(28)ని శనివా రం అరెస్టు చేసినట్లు మదనపల్లె డీఎస్పీ కొండ య్యనాయుడు వెల్లడిం చారు.

గంజాయి కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు
గంజాయి కేసు నిందితుడి అరెస్టు చూపుతున్న డీఎస్పీ కొండయ్యనాయుడు

మదనపల్లెఅర్బన, సెప్టెం బరు 28: గంజాయి కేసు లో ప్రఽధాన నిందితుడు మౌలాలి(28)ని శనివా రం అరెస్టు చేసినట్లు మదనపల్లె డీఎస్పీ కొండ య్యనాయుడు వెల్లడిం చారు. మదనపల్లె రూర ల్‌ పోలీసుస్టేషనలో శనివారం ఆయన మీడియా సమావేశంలో వివరా లు వెల్లడించారు. కలకడ మండలం, బంగారువాండ్లపల్లెకు చెందిన పఠాన మౌలాలిని త ంబళ్లపల్లె మండలం, జోగివానిబురుజు వద్ద ముది వేడు ఎస్‌ఐ తనసిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకుని అరకేజీ గంజా యిని స్వాఽధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతను గాంజాయిని వైజాక్‌ నుంచి రైలు మార్గంలో తరలించి, అంగళ్లు సమీపంలోని కళాశాలలు, స్కూల్స్‌, చిన్నచిన్న బంకులకు, తన మిత్రుల ద్వారా ద్విచక్రవాహనంపై తరలించి అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇతను వివిధ కేసుల్లో కూడా ప్రధాన నిందితుడుగా ఉన్నారని, చాలాసార్లు పోలీసులకు కన్నుకప్పి పారిపోగా మొదట సారీ అరెస్టు చేశామన్నారు. కార్యక్రమంలో ముది వేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌, కానిస్టేబుల్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 11:40 PM