Share News

నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:11 PM

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆర్జీయూకేటీ వైస్‌చాన్సలర్‌ విజయ్‌కుమార్‌ మెస్‌ నిర్వాహకులకు సూచించారు.

నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
ట్రిపుల్‌ఐటీ మెస్‌ను తనిఖీ చేస్తున్న ఆర్జీయూకేటీ వీసీ విజయ్‌కుమార్‌

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ మెస్‌లను తనిఖీ చేసిన వీసీ

వేంపల్లె, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆర్జీయూకేటీ వైస్‌చాన్సలర్‌ విజయ్‌కుమార్‌ మెస్‌ నిర్వాహకులకు సూచించారు. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో మెస్‌లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు తింటున్న ఆహార పదార్థాల ను పరిశీలించారు. మరింత నాణ్యతగా ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. పలు సూచనలిచ్చారు. సరైన ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డైరెక్టర్‌ కుమారస్వామి గుప్త, ఏఓ రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:11 PM