Share News

శివశివ మూర్తివి గణనాథా..

ABN , Publish Date - Sep 09 , 2024 | 12:10 AM

‘శివశివ మూర్తివి గణనాథా.. నువ్వు శివుని కుమారుడవు గణనాథా’ అం టూ భక్తులు వినాయకుని పూజించారు.

శివశివ మూర్తివి గణనాథా..
ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలో మట్టి గణేషుడు

కడప (కల్చరల్‌), సెప్టెంబరు 8: ‘శివశివ మూర్తివి గణనాథా.. నువ్వు శివుని కుమారుడవు గణనాథా’ అం టూ భక్తులు వినాయకుని పూజించారు. ఆదివారం చవితి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వ హించారు. తాము తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా ఆశీర్వదించాలని స్వామిని వేడుకున్నారు.

కడప నగరంలో... కడప నగరం ఎనజీవో కాలనీలో వినాయక ఉత్సవ కమిటీ చైర్మన అందూరి రాజగోపాల్‌రెడ్డి సారధ్యంలో 42 అడుగుల భారీ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. రాజీవ్‌ పార్క్‌ వద్ద భారీ సెట్టింగులను ఏర్పాటు చేశారు. నాగరాజుపేట, గా యత్రి టవర్స్‌, అప్సరా సర్కిల్‌, ఏడు రోడ్లు, పాతమున్సిపాలిటీ, కో-ఆపరేటివ్‌ కాలనీ, ఆలంఖానపల్లె, విజయదుర్గాకాలనీ, తదితర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన వినాయకుడి విగ్రహాలను పలువురు భక్తులు దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 9వ డివిజన ఆ ర్టీఓ కార్యాలయ సమీపంలో వినాయక ఉత్సవ కమటీ సభ్యురాలు గౌరీదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వి నాయకుడి విగ్రహం వద్ద ఆదివారం భక్తులకు అన్నదానం నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు జీవీ రమణ, మాలే శివ హాజరై అన్నదానం చేశారు.

Updated Date - Sep 09 , 2024 | 12:10 AM