Share News

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు: ఎస్‌ఐ

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:14 PM

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని సింహాద్రిపురం ఎస్‌ఐ మహమ్మద్‌ షరీఫ్‌ హెచ్చరించారు.

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు: ఎస్‌ఐ
వాహనాల తనిఖీలో ఎస్‌ఐ షరీఫ్‌

సింహాద్రిపురం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని సింహాద్రిపురం ఎస్‌ఐ మహమ్మద్‌ షరీఫ్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. సా యంకాలం మండల పరిధిలో వాహనాల తనిఖీ నిర్వహించారు. రికార్డులు సరిగాలేని వాహనదారులకు జరిమానా విధించారు. వాహనదారులు తప్పనిసరిగా వారి వాహనానికి సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉంచుకోవాలని ఎస్‌ఐ ప్రజలకు సూచించారు.

Updated Date - Oct 22 , 2024 | 11:14 PM