Share News

Crime News: ఆరేళ్ల కూతురిని చంపి బావిలో పడేసి.. ఆపై ఏమీ తెలియనట్టుగా..

ABN , Publish Date - Jun 22 , 2024 | 10:59 AM

నార్పలలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. కన్నకూతురిని హత్య చేసి బావిలో పడేశాడో కసాయి తండ్రి. ఆపై ఏమీ ఎరుగనట్టుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీన్ కట్ చేస్తే పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసింది. గణేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా పోలీసుల వద్ద అసలు నిజం బయటపెట్టాడు.

Crime News: ఆరేళ్ల కూతురిని చంపి బావిలో పడేసి.. ఆపై ఏమీ తెలియనట్టుగా..

అనంతపురం: అనంతపురం జిల్లా నార్పలలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. కన్నకూతురిని హత్య చేసి బావిలో పడేశాడో కసాయి తండ్రి. ఆపై ఏమీ ఎరుగనట్టుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీన్ కట్ చేస్తే పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసింది. గణేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా పోలీసుల వద్ద అసలు నిజం బయటపెట్టాడు.


గణేష్ అనే వ్యక్తి తన ఆరేళ్ల కూతరు పావనిని దారుణంగా హత్య చేసి బావిలో పడేశాడు. ఆపై మూడు రోజుల క్రితం అంగడికి వెళ్లి కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక తండ్రి గణేష్‌ను పోలీసులు అదుపులోకి ప్రశ్నించారు. పోలీసుల విచారణలో బాలికను హత్య చేసి బావిలో పడేసినట్లు గణేష్ అంగీకరించాడు. దీంతో పోలీసులు బావి నుంచి పాప మృతదేహాన్ని బయటకు తీయించారు. బాలిక మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Updated Date - Jun 22 , 2024 | 10:59 AM