Share News

Deputy CM: విశ్వ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

ABN , Publish Date - Jun 30 , 2024 | 07:34 AM

అమరావతి: రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుందన్నారు.

Deputy CM: విశ్వ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
Pawan Kalyan

అమరావతి: రెండవ సారి టీ20 (T20) ప్రపంచకప్ (World Cup) గెలుచుకుని విశ్వ విజేతగా (World Champion) నిలచిన భారత జట్టుకు (Team India) ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) అభినందనలు తెలిపారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుందన్నారు. దక్షిణాఫ్రికాతో (South Africa) జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమిష్టిగా రాణించిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకం.. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్‌‌లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.


ఈ వార్త కూడా చదవండి..

కాగా ఉత్కంఠభరితంగా ముగిసిన టీ20 వరల్డ్‌క్‌ప ఫైనల్లో భారత్‌ చాంపియన్‌గా నిలిచింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రోహిత్‌ సేన 7 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 2007 తర్వాత మరోసారి ఈ మెగా టోర్నీని కైవసం చేసుకున్నట్టయ్యింది. అలాగే 2011 తర్వాత ఏ ఫార్మాట్‌లోనైనా జట్టుకిదే తొలి వరల్డ్‌కప్‌. అటు మొదటిసారి ఐసీసీ టోర్నీలో ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా విజయం అంచులవరకు వచ్చినా చివర్లో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 76), అక్షర్‌ పటేల్‌ (31 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 47), శివమ్‌ దూబే (16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 27) రాణించారు. కేశవ్‌, నోకియాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసి ఓడింది. క్లాసెన్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52), స్టబ్స్‌ (31), డికాక్‌ (39), మిల్లర్‌ (21) రాణించారు. హార్దిక్‌కు మూడు.. బుమ్రా, అర్ష్‌దీప్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా విరాట్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా బుమ్రా నిలిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కప్పు దరిచేరె.. విజేతగా వీడ్కోలు

జగన్‌ కక్షకు బందరు పోర్టు బలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 30 , 2024 | 08:15 AM