Share News

Kidnap: పత్తికొండ మండలంలో యువతి కిడ్నాప్ కలకలం..

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:23 PM

కర్నూలు జిల్లా: పత్తికొండ మండలంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పులికొండ గ్రామానికి చెందిన వరదరాజులు కూతురును కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన సత్యం నాయుడు కిడ్నాప్ చేశాడు. తన కూతురుకు ఆరోగ్యం బాగా లేకపోతే పత్తికొండలో వైద్యం చేసుకోవడానికి స్కూటర్‌పై వస్తున్న వరదరాజులును...

Kidnap: పత్తికొండ మండలంలో యువతి కిడ్నాప్ కలకలం..

కర్నూలు జిల్లా: పత్తికొండ మండలంలో యువతి కిడ్నాప్ (young woman Kidnap) కలకలం రేపింది. పులికొండ గ్రామానికి చెందిన వరదరాజులు కూతురును కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన సత్యం నాయుడు కిడ్నాప్ చేశాడు. తన కూతురుకు ఆరోగ్యం బాగా లేకపోతే పత్తికొండలో వైద్యం చేయించడానికి స్కూటర్‌పై వస్తున్న వరదరాజులును సత్యం నాయుడు మార్గమధ్యలో స్కార్పియోతో ఢీ కొట్టి.. తుపాకీతో బెదిరించి వరదరాజులు కూతురును కిడ్నాప్‌కు యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకున్న వరద రాజులపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో పత్తికొండ పోలీసులకు వరదరాజులు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా సత్యం నాయుడు పరారీలో ఉన్నాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 25 , 2024 | 01:26 PM