Share News

వైభవంగా పల్లకీ సేవ

ABN , Publish Date - Sep 17 , 2024 | 12:06 AM

మహానంది క్షేత్రంలో సోమవారం రాత్రి ఘనంగా పల్లకీ సేవను ఆలయ వేదపండితులు నిర్వహించారు.

వైభవంగా పల్లకీ సేవ
మహానందిలో పల్లకీ సేవ నిర్వహిస్తున్న వేదపండితులు

మహానంది, సెప్టెంబరు 16: మహానంది క్షేత్రంలో సోమవారం రాత్రి ఘనంగా పల్లకీ సేవను ఆలయ వేదపండితులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో మహానందీశ్వరుడు, కామేశ్వరీదేవి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఆశీనులుజేచారు. వేదమంత్రాలతో పూజలను జరిపారు. ఆలయ మెదటి ప్రాకారంలో భక్తుల శివనామస్మరణ మధ్య పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 12:10 AM