Share News

మహానందిలో పల్లకీ ఉత్సవం

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:34 AM

మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు.

మహానందిలో పల్లకీ ఉత్సవం
పల్లకీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న వేదపండితులు

మహానంది, సెప్టెంబరు 20: మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. పల్లకిలో ఉత్సవమూర్తుల విగ్రహాలను ఆశీనులు గావించారు. వేదమంత్రాలతో స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ మెదటి ప్రాకారంలో భక్తుల శివనామస్మరణ మధ్య పల్లకీ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:34 AM