Share News

MP Rammohan Naidu : ఏపీని ఎయిర్‌లైన్‌ హబ్‌గా మారుస్తాం

ABN , Publish Date - Jun 19 , 2024 | 05:11 AM

దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఎయిర్‌లైన్‌ హబ్‌గా మారుస్తామని పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు.

MP Rammohan Naidu : ఏపీని ఎయిర్‌లైన్‌ హబ్‌గా మారుస్తాం

3 నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి: రామ్మోహన్‌

శ్రీకాకుళం, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఎయిర్‌లైన్‌ హబ్‌గా మారుస్తామని పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. మంగళవారం శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మూడోసారి ఎంపీగా ప్రజలు గెలిపించారు. చంద్రబాబు మరింత నమ్మకం ఉంచారు. దేశంలో ప్రధానమంత్రితో కలుపుకొని 30మంది కేంద్రమంతులతో ఉన్న పరిచయాలతో రాష్ట్రానికి శాఖల వారీగా నిధులు తీసుకువస్తాను. రాష్ట్రాన్ని హబ్‌గా మారుస్తాం. భోగాపురం ఎయిర్‌పోర్టు నత్తనడకన ఇంతవరకు పనులు జరిగాయి. మూడు నెలల్లో ఎయిర్‌పోర్టు పనులను పూర్తిచేయించి జాతికి అంకితమిస్తాం’’ అని స్పష్టం చేశారు.

Updated Date - Jun 19 , 2024 | 05:11 AM