Share News

విశాఖతో రతన్‌టాటాకు అనుబంధం

ABN , Publish Date - Oct 11 , 2024 | 05:17 AM

పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటా ఆరేళ్ల క్రితం విశాఖపట్నాన్ని సందర్శించారు. ఏయూ పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశాఖతో రతన్‌టాటాకు అనుబంధం

  • 2018లో ఏయూ పూర్వవిద్యార్థుల కార్యక్రమానికి హాజరు

విశాఖపట్నం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటా ఆరేళ్ల క్రితం విశాఖపట్నాన్ని సందర్శించారు. ఏయూ పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్నారు. 2018 డిసెంబరు 10న ఏయూలో జరిగిన నాటి సమావేశంలో గడిపిన క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని రతన్‌టాటా ఎంతో భావోద్వేగంతో అన్నారని పలువురు గుర్తుచేసుకున్నారు. టాటాను విశాఖ తీసుకురావడానికి జీఎంఆర్‌ చొరవ తీసుకున్నారు. ఏయూ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో రతన్‌టాటాపై ఒక నృత్య రూపకం ప్రదర్శించారు. ఆయనకు చిత్రపటాన్ని బహూకరించారు.

Updated Date - Oct 11 , 2024 | 05:17 AM