Share News

CM Jagan: జగన్ సభ కోసం విద్యార్థులకు తిప్పలు..

ABN , Publish Date - Feb 23 , 2024 | 08:20 AM

ఒంగోలులో ఈ రోజు సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం జగన్ ఒంగోలు వస్తున్నారు. జగన్ బహిరంగ సభకి జనసమీకరణ కోసం ప్రైవేటు స్కూల్ బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్, మిగిలిన విద్యార్థులకు ఈరోజు నుంచి ఎఫ్ఏ-4 ఎగ్జామ్స్ జరగనున్నాయి. బస్సులు లేక పోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.

CM Jagan: జగన్ సభ కోసం విద్యార్థులకు తిప్పలు..

ప్రకాశం: ఒంగోలు (Ongole)లో ఈ రోజు సీఎం జగన్ (CM Jagan) పర్యటించనున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం జగన్ ఒంగోలు వస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ బహిరంగ సభను సైతం నిర్వహించనున్నారు. బహిరంగ సభకి జనసమీకరణ కోసం ప్రైవేటు స్కూల్ బస్సు (School Bus)లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పదవ తరగతి (Tenth Class) విద్యార్థులకు ఫ్రీ ఫైనల్, మిగిలిన విద్యార్థులకు ఈరోజు నుంచి ఎఫ్ఏ-4 ఎగ్జామ్స్ జరగనున్నాయి. బస్సులు లేక పోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి 500లకు పైగా ఆర్టీసీ బస్సులను జగన్ సభ కోసం అధికారులు పెట్టారు. డిపోలలో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

Updated Date - Feb 23 , 2024 | 08:20 AM