Home » CM Jagan
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు, పార్టీ నేతలు బిజీగా ఉండగా, మరికొందరు బెట్టింగుల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది..? మెజార్టీ ఎంత ఉండనుంది..? మ్యాజిక్ ఫిగర్..? ప్రముఖుల బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారనే అంశాలపై రూ.కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది.
గోదారోళ్ల వెటకారమే వేరు. ఏదైనా ఉతికి ఆరేస్తారు. మాటలో మర్యాద తప్పరు. గురీ తప్పదు. ఎన్నికలప్రచారం రెండునెలలకుపైగానే రంజుగా సాగి చిన్నగా గూటికి చేరుకొంటోంది. దీంతో ఎన్నికలపైనా గోదావరి జిల్లాల్లో సెటైర్లు పేలుతున్నాయి.
ఐదేళ్ల జగన్ పాలనపై తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది. సోమవారమే పోలింగ్! ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధం కండి! మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్రం బాగు కోసం ఓటేయండి
సర్వేలను తాను నమ్మనని వైసీపీకి ఈ ఎన్నికల్లో 17కు 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి టార్గెట్ అదేనని.. ఆ టార్గెట్ కచ్చితంగా కొడతామని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.
ఏపీలో ఉన్న పరిశ్రమలను ఐదేళ్లలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం దెబ్బతీసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari) అన్నారు. రాష్ట్రంలో కోళ్ల పెంపకం పెద్ద సంఖ్యలో జరుగుతుందని చెప్పారు. 2019కి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించి రైతులకు ఇంట్రెస్ట్ సబ్సిడీ సౌకర్యం ఇచ్చేవారని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వారికి ఇచ్చే సబ్సిడీ పూర్తిగా ఎత్తేశారని మండిపడ్డారు.
Andhrapradesh: ‘‘నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి ఐకాన్ స్టార్, హీరో అల్లు అర్జున్ వస్తే.. ఎమ్మెల్యే అనుచరులు జనసేన జెండాలు పట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇది తగునా?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ జెండాలు పట్టుకొని చీకటి రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఒక రకమైన క్యాన్సర్లాంటిదని, ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేలూనుకుంటే శాంతిని, భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు. బీజేపీ అడుగు పెడితే సమాజం నిట్టనిలువునా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆదాయమూ రావని ఆందోళన వ్యక్తం చేశారు.
మాచర్లలో వైసీపీ పాలనలో ఐదేళ్లు అప్రజాస్వామిక పరిస్థితులతో ప్రజలు భయాందోళనలు చెందారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డిపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు కారణంగా ఈరోజు మాచర్ల ప్రజాగళం సభకు రాలేకపోయానని తెలిపారు. ఈమేరకు మాచర్ల సభను ఉద్దేశించి చంద్ర బాబు వీడియో సందేశం విడుదల చేశారు.
ఈ ఎన్నికల్లో ప్రలోభాల కోసం కుప్పం, మంగళగిరికి జగన్ రూ.300 కోట్ల చొప్పున పంపారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ఆరోపణలు చేశారు. పాపపు సొమ్ము ఓటుకు రూ.10వేలు ఇస్తారట.. తీసుకోవాలని.. ఓటు మాత్రం కూటమి అభ్యర్థులకు వేయాలని పిలుపునిచ్చారు.
దేశంలో మత విద్వేషాల ద్వారా బీజేపీ పాలన సాగిస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వచ్చినట్లు మతాన్ని నమ్మవచ్చని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక చట్టాలు తీసుకు వచ్చి మైనార్టీలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. రూ. 16లక్షల కోట్ల రుణాలను కార్పోరేట్ శక్తులకోసం మోదీ మాఫీ చేశారని ధ్వజమెత్తారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీతారాం ఏచూరి ప్రసంగించారు.