Share News

Viral Video: గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్

ABN , Publish Date - Sep 09 , 2024 | 06:56 AM

గణేష్ చతుర్థి 2024 పండుగ వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముంబైలో నిన్న రాత్రి జరిగిన గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అనంత్ అంబానీ, ఆయన భార్య రాధిక మర్చంట్‌ సహా అంబానీ ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్
anant ambani Radhika Merchant Ganesh Idol Immersion

దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి 2024 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ముంబయిలో జరిగిన గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అనంత్ అంబానీ(anant ambani), ఆయన భార్య రాధిక మర్చంట్‌లు(Radhika Merchant) పాల్గొన్నారు. ఈ వేడుకలో నీతా అంబానీతోపాటు కుటుంబం మొత్తం పాల్గొని వైభవంగా గణపతి బప్పాకు వీడ్కోలు పలికారు. అందుకు సంబంధించిన అనేక చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఇంటి ఆంటిలియా నుంచి పూల రథంపై గణేశుడికి జేజేలు పలుకుతూ వీడ్కోలు ఇచ్చారు. అంతకుముందు అంబానీ ఫ్యామిలీ సెప్టెంబర్ 7న గణేశ విగ్రహాన్ని స్వాగతించారు.


మొదటి హారతి

నిమజ్జన వేడుకలో భాగంగా నీతా అంబానీ గణపతి విగ్రహాన్ని నిమజ్జన ప్రదేశానికి తీసుకు వేళ్లే క్రమంలో అలంకరించబడిన ట్రక్‌పై నిల్చున్నారు. ఆ క్రమంలో అంబానీ కుటుంబం వీధుల్లో ప్రజలకు స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా రాధిక ఎంబ్రాయిడరీ మోడల్ నీలం రంగు డ్రెస్ ధరించగా, అనంత్ నారింజ రంగు కుర్తా పైజామా ధరించారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ ఎంతో సంబంరంగా జేజేలు పలుకుతూ చప్పట్లతో వీధుల గుండా గణపతికి వీడ్కోలు పలికారు. దీనికి ముందు కొత్తగా పెళ్లయిన ఈ జంట అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ భార్యాభర్తలుగా కలిసి గణపతికి తమ మొదటి హారతి ఇచ్చారు. మరుసటి రోజు ఆనందంతో గణేశుడికి వీడ్కోలు పలికారు.


బాలీవుడ్‌ ప్రముఖులు కూడా..

ఈ గణేష్ పూజలో అంబానీ ఫ్యామిలీ బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులను కూడా ఆహ్యానించింది. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఇటీవల తమ వేసవి సెలవుల నుంచి ముంబై తిరిగి వచ్చారు. ఈ క్రమంలో వారి మొదటి పబ్లిక్ ఈవెంట్‌కు హాజరయ్యారు. వీరితో పాటు దంపతులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కూడా వచ్చారు. అమీర్ ఖాన్ కుమారులు, మహారాజ్ నటుడు జునైద్ ఖాన్, అతని తమ్ముడు ఆజాద్ ఖాన్‌తో కలిసి వచ్చారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తన భార్య, కూతురు, కొడుకు టైగర్ ష్రాఫ్‌తో కలిసి వచ్చారు. వీళ్లతోపాటు మరికొందరు కూడా సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

Next Week IPOs: ఈ వారం ఐపీఓల పండుగ.. పెట్టుబడిదారులకు డబ్బే డబ్బు!

Money Saving Plan: రిటైర్‌ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..


Stock Market: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 09 , 2024 | 07:12 AM