Share News

Hyderabad: విద్యుత్‌ స్తంభం ఎక్కి తాగుబోతు హల్‌చల్‌..

ABN , Publish Date - Jun 13 , 2024 | 09:51 AM

అతడికి కోపం వచ్చినా, భార్యతో గొడవపడినా తాగిన మత్తులో ఒక్కోసారి ప్రమాదకరంగా మారి ప్రజలను భయపెడతాడు. అతడే మోహన్‌బాబు. కేవలం రెండేళ్లలో ఐదుసార్లు హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాలు ఎక్కి సైదాబాద్‌(Saidabad) పోలీసులకు, స్థానిక ప్రజలకు ముచ్చెమటలు పట్టించాడు.

Hyderabad: విద్యుత్‌ స్తంభం ఎక్కి తాగుబోతు హల్‌చల్‌..

- రెండేళ్లలో ఐదోసారి..

హైదరాబాద్: అతడికి కోపం వచ్చినా, భార్యతో గొడవపడినా తాగిన మత్తులో ఒక్కోసారి ప్రమాదకరంగా మారి ప్రజలను భయపెడతాడు. అతడే మోహన్‌బాబు. కేవలం రెండేళ్లలో ఐదుసార్లు హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాలు ఎక్కి సైదాబాద్‌(Saidabad) పోలీసులకు, స్థానిక ప్రజలకు ముచ్చెమటలు పట్టించాడు. సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న మోహన్‌బాబు(25) బుధవారం సాయంత్రం 6.30 గంటలకు మద్యం మత్తులో శంకేశ్వర్‌బజార్‌ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభం(High tension electric pole) ఎక్కి హంగామా సృష్టించాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: వామ్మో.. రూ. 10 కోట్లు కొల్లగొట్టేశారుగా..


స్థానికులు గమనించి విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇవ్వగా, విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. కాగా, మోహన్‌బాబు కిందకు రాకుండా స్తంభం మీదే కూర్చొని సిగరెట్‌ వెలిగిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేశాడు. గంటన్నర పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 09:51 AM