Share News

Hyderabad: మాట్లాడుకుందామని పిలిచి.. సోదరులపై కత్తులతో దాడి.. ఒకరి మృతి

ABN , Publish Date - Jun 20 , 2024 | 10:47 AM

మాట్లాడుకుందామని పిలిపించి నలుగురు సోదరులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కాలాపత్తర్‌(Kalapathar)కు చెందిన అన్వర్‌, అసద్‌ పాత నేరస్థులు. అదే ప్రాంతానికి చెందిన వాజిద్‌, సాజిద్‌, ఖదీర్‌, రఫీక్‌ సిమ్లాన్‌(38) నలుగురూ సోదరులు. అన్వర్‌, అసద్‌లతో వాజిద్‌ సోదరులకు పాతకక్షలున్నాయి.

Hyderabad: మాట్లాడుకుందామని పిలిచి.. సోదరులపై కత్తులతో దాడి.. ఒకరి మృతి

హైదరాబాద్: మాట్లాడుకుందామని పిలిపించి నలుగురు సోదరులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కాలాపత్తర్‌(Kalapathar)కు చెందిన అన్వర్‌, అసద్‌ పాత నేరస్థులు. అదే ప్రాంతానికి చెందిన వాజిద్‌, సాజిద్‌, ఖదీర్‌, రఫీక్‌ సిమ్లాన్‌(38) నలుగురూ సోదరులు. అన్వర్‌, అసద్‌లతో వాజిద్‌ సోదరులకు పాతకక్షలున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో మాట్లాడుదామని వాజిద్‌ను అన్వర్‌, అసద్‌ ఫాతిమా హాస్పిటల్‌ వద్దకు పిలిపించారు. వాజిద్‌(Wajid) అక్కడికి వెళ్లిన విషయం తెలుసుకున్న అతని సోదరులు సాజిద్‌, ఖదీర్‌, రఫీక్‌ సిమ్లాన్‌ కూడా అక్కడికి వెళ్లారు.


అన్వర్‌, అసద్‌లకు వాజిద్‌ సోదరులకు మధ్య వివాదం తలెత్తింది. రెండు గ్రూప్‌ల మధ్య మాటామాటా పెరగడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అన్వర్‌, అసద్‌లు వాజిద్‌ సోదరులపై కత్తులతో దాడికి దిగారు. తీవ్ర గాయాలపాలైన రఫీక్‌ సిమ్లాన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. వాజిద్‌, సాజిద్‌, ఖదీర్‌లకు కత్తి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అన్వర్‌, అసద్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 10:47 AM