Share News

Hyderabad: ఆడుకోవద్దని అమ్మ మందలించిందని..

ABN , Publish Date - Jul 05 , 2024 | 09:49 AM

ఇంటికి దూరంగా వెళ్లి ఆడుకోవద్దని తల్లి మందలించినందుకు మనోవేదనకు గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. గాంధీనగర్‌ ఎస్‌ఐ నాగరాజు రెడ్డి(Gandhinagar SI Nagaraju Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. న్యూబోయిగూడలో నివాసం ఉండే అబ్దుల్‌రజాక్‌కు నలుగురు కుమార్తెలు, ఇద్దరు అబ్బాయిలు.

Hyderabad: ఆడుకోవద్దని అమ్మ మందలించిందని..

హైదరాబాద్: ఇంటికి దూరంగా వెళ్లి ఆడుకోవద్దని తల్లి మందలించినందుకు మనోవేదనకు గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. గాంధీనగర్‌ ఎస్‌ఐ నాగరాజు రెడ్డి(Gandhinagar SI Nagaraju Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. న్యూబోయిగూడలో నివాసం ఉండే అబ్దుల్‌రజాక్‌కు నలుగురు కుమార్తెలు, ఇద్దరు అబ్బాయిలు. చిన్న కుమార్తె జియా ఫాతిమా (13) మదర్సాలో చదువుకుంటోంది. మూడురోజుల క్రితం బన్సీలాల్‌పేటకు వెళ్లి స్నేహితులతో ఆడుకొని ఇంటికి వచ్చింది. అంత దూరం వెళ్లినందుకు ఫాతిమాను తల్లి మందలించింది. అప్పటి నుంచి తల్లితో మాట్లాడకుండా, స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది.

ఇదికూడా చదవండి: Hyderabad: మానసిక ఒత్తిడితో.. వైద్యురాలి ఆత్మహత్య


గురువారం ఉదయం 11.30 సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు.. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో బద్దలుకొట్టి చూడగా ఫాతిమా వేలాడుతూ కనిపించింది. గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 09:50 AM