Share News

Tamil Nadu : 39కి కల్తీసారా మృతులు

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:40 AM

తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 39కి చేరింది. వీరిలో ఐదుగురు మహిళలున్నారు.

Tamil Nadu : 39కి కల్తీసారా మృతులు

  • తమిళనాడులో పెరిగిన మరణాల సంఖ్య

  • మృతుల్లో ఐదుగురు మహిళలు

  • 24 మంది పరిస్థితి విషమం.. ఎటుచూసినా వేదనే

  • 33 మంది కంటిచూపు కోల్పోయే ప్రమాదం

  • తమిళనాడులో 39కి పెరిగిన

  • కల్తీసారా మృతులు

చెన్నై, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 39కి చేరింది. వీరిలో ఐదుగురు మహిళలున్నారు. ఎటు చూసినా ఆ ప్రాంతం రోదనలు, వేదనలతో కన్నీటిసంద్రంలా మారిపోయింది. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు, భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త, తమ ఇంటి పెద్దలను కోల్పోయిన కుటుంబీకుల రోదనలతో ఏ ఇల్లు చూసినా విషాదంలో మునిగిపోయింది. కాగా గురువారం సాయంత్రానికి 30 మందికి పైగా అంత్యక్రియలు పూర్తి చేశారు. కల్తీ సారా తాగడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో మరో వందమందికి పైగా కళ్లకుర్చి, పుదుచ్చేరి, విల్లుపురం, సేలం తదితర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మరో 24 మంది పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు ప్రకటించారు. అస్వస్థతకు గురైనవారిలో 33 మందికి పైగా బాధితులు కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే అవకాశముందని వైద్యులు పేర్కొన్నారు.

Updated Date - Jun 21 , 2024 | 03:41 AM