Share News

LokSabha Elections: దోస్తి.. కుస్తి

ABN , Publish Date - May 28 , 2024 | 05:24 PM

ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భాగస్వామ్య పక్షాలు. అయితే ఈ రెండు పార్టీలు సార్వత్రిక ఎన్నికల వేళ... పలు లోక్‌‌సభ స్థానాల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే దేశ రాజధాని న్యూఢిల్లీల్లో మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో ఆప్ పోటీ చేస్తుంటే.. 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నిలిపింది.

LokSabha Elections: దోస్తి.. కుస్తి

పంజాబ్, మే 28: ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భాగస్వామ్య పక్షాలు. అయితే ఈ రెండు పార్టీలు సార్వత్రిక ఎన్నికల వేళ... పలు లోక్‌‌సభ స్థానాల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే దేశ రాజధాని న్యూఢిల్లీల్లో మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో ఆప్ పోటీ చేస్తుంటే.. 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నిలిపింది. అయితే పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. పరోక్షంగా ఇరు పార్టీలపై పరోక్షంగా విమర్శలు చేయడం గమనార్హం.

పంజాబ్ రాజధాని అమృత్‌సర్‌లో మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. పంజాబ్ యువత డ్రగ్స్ బారిన పడిందన్నారు. దాంతో ఆ రాష్ట్ర భవిష్యత్తుకు ముప్పుగా పరిణమించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. అయితే పంజాబ్‌లో ఆప్ పార్టీకి చెందిన భగవంత్ మాన్ సర్కార్ అధికారంలో ఉంది. అలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లిఖార్జున్ ఖర్గే ఇలా భాగస్వామ్య పక్షం ఆప్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.


ఇక ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం లూథియానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా 75 ఏళ్లు ఓ పార్టీ పరిపాలించిందంటూ కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు చేశారు. తమ పార్టీ పంజాబ్‌లో అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 28 , 2024 | 06:03 PM