Share News

Ayodhya Ram Mandir: 22న పుదుచ్చేరికి సెలవు: సీఎం

ABN , Publish Date - Jan 20 , 2024 | 11:32 AM

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈ నెల 22న పుదుచ్చేరికి సెలవు ప్రకటిస్తూ సీఎం ఎన్‌.రంగస్వామి(CM N. Rangaswamy) ఉత్తర్వులు జారీ చేశారు.

Ayodhya Ram Mandir: 22న పుదుచ్చేరికి సెలవు: సీఎం

పుదుచ్చేరి: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈ నెల 22న పుదుచ్చేరికి సెలవు ప్రకటిస్తూ సీఎం ఎన్‌.రంగస్వామి(CM N. Rangaswamy) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం కేంద్రప్రభుత్వ కార్యాలయాలకు మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెలవు ప్రకటించింది. అలాగే, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‏గఢ్‌, మహారాష్ట్ర(Madhya Pradesh, Uttar Pradesh, Chhattisgarh, Maharashtra) తదితర బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వాలు 22వ తేది సెలవురోజుగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, సీఎం కూడా రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని టీవీ ఛానళ్లలో వీక్షించేలా రాష్ట్రప్రజలకు అవకాశం కల్పిసూ సెలవు దినంగా ప్రకటించారు.

Updated Date - Jan 20 , 2024 | 11:32 AM