Share News

CBSE: నేటి నుంచి సీబీఎస్ఈ10,12వ తరగతి పరీక్షలు

ABN , Publish Date - Feb 15 , 2024 | 09:36 AM

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, పాఠశాలలు, తల్లిదండ్రులకు సీబీఎస్ఈ అడ్వయిజరి జారీ చేసింది.

CBSE: నేటి నుంచి సీబీఎస్ఈ10,12వ తరగతి పరీక్షలు

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, పాఠశాలలు, తల్లిదండ్రులకు సీబీఎస్ఈ అడ్వయిజరి జారీ చేసింది. విద్యార్థులందరూ ఉదయం 10:00 గంటలకంటే ముందే తమ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పరీక్షా కేంద్రాలకు త్వరగా చేరుకోవడానికి మెట్రో సేవలను వినియోగించుకోవాలంది. 10 గంటల తరువాత విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ విషయంలో అన్ని పాఠశాలలు సాయం చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Updated Date - Feb 15 , 2024 | 09:36 AM