Share News

Aadhaar Ration Card Link: ఆధార్‌-రేషన్‌ లింక్‌ గడువు పెరిగింది.. చెక్ చేసుకోండి!

ABN , Publish Date - Jun 14 , 2024 | 04:27 AM

ఆధార్‌, రేషన్‌ కార్డుల అనుసంధానానికి గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 30వరకు ఉన్న గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌరసరఫరాల విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

 Aadhaar Ration Card Link: ఆధార్‌-రేషన్‌ లింక్‌ గడువు పెరిగింది.. చెక్ చేసుకోండి!

న్యూఢిల్లీ, జూన్‌ 13: ఆధార్‌, రేషన్‌ కార్డుల అనుసంధానానికి గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 30వరకు ఉన్న గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌరసరఫరాల విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒక దేశం-ఒక రేషన్‌ కార్డు అన్న విధానంలో భాగంగా ఆధార్‌ అనుసంధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆయా రాష్ట్రాల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) పోర్టల్‌ ద్వారా ఈ అనుసంధానం చేసుకోవచ్చు.

Updated Date - Jun 14 , 2024 | 10:56 AM