Share News

Chennai: ‘మాస్‌’ మాజీ అధ్యక్షుడు జగ్గయ్య కన్నుమూత...

ABN , Publish Date - Jun 20 , 2024 | 12:02 PM

‘మద్రాస్‌ ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసి సంక్షేమ సంఘం’ (మాస్‌) మాజీ అధ్యక్షుడు ఒ.జగ్గయ్య (80) గురువారం ఉదయం కన్నుమూశారు. స్థానిక ఆంజనేయనగర్‌(Anjaneyanagar), 2వ లేన్‌లోని ఆయన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు.

Chennai: ‘మాస్‌’ మాజీ అధ్యక్షుడు జగ్గయ్య కన్నుమూత...

చెన్నై: ‘మద్రాస్‌ ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసి సంక్షేమ సంఘం’ (మాస్‌) మాజీ అధ్యక్షుడు ఒ.జగ్గయ్య (80) గురువారం ఉదయం కన్నుమూశారు. స్థానిక ఆంజనేయనగర్‌(Anjaneyanagar), 2వ లేన్‌లోని ఆయన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. సాయంత్రం స్థానిక మూలకొత్తలం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. జగ్గయ్య ఇన్‌కంట్యాక్స్‌లో సుదీర్ఘకాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం పదవీవిరమణ చేశారు.

ఇదికూడా చదవండి: Chennai: ఉరుములు మెరుపులతో వర్షం.. రెండో రోజూ విమాన సేవలకు అంతరాయం


ఆ తరువాత పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మాస్‌ అధ్యక్షునిగా, సలహాదారుగా క్రియాశీలకంగా వ్యవహరించారు. జగ్గయ్య(Jaggayya) మృతి పట్ల మాస్‌ అధ్యక్షులు డాక్టర్‌ కొల్లి రాజు, ఇతర నిర్వాహకులు, నగరంలోని వివిధ తెలుగు సంఘాలు తీవ్ర సంతాపం ప్రకటించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 12:02 PM