Share News

Good news: ఉద్యోగులకు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. అదేంటో తెలిస్తే..

ABN , Publish Date - Jun 15 , 2024 | 12:13 PM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి డీఎంకే సర్కారు(DMK Govt) శుభవార్త చెప్పింది. 2016 సంవత్సరానికి ముందు అమల్లో ఉన్న వేతన భత్యాలను అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు 9 శాతం డీఏ పెంచుతూ శనివారం జీవో జారీ చేసింది.

Good news: ఉద్యోగులకు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. అదేంటో తెలిస్తే..

- 9 శాతం డీఏ పెంపు

- జీవో జారీ చేసిన సర్కారు

చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి డీఎంకే సర్కారు(DMK Govt) శుభవార్త చెప్పింది. 2016 సంవత్సరానికి ముందు అమల్లో ఉన్న వేతన భత్యాలను అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు 9 శాతం డీఏ పెంచుతూ శనివారం జీవో జారీ చేసింది. ఈ పెంచిన డీఏ ఈ యేడాది జనవరి 1వ తేదీ నుంచి అందజేయనున్నారు. తాజా పెంపుతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్‌ పే, డీఏలో 239 శాతం అందుకోనున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలకు సంబంధించిన పెంచిన డీఏను ఆన్‌లైన్‌(Online) ద్వారా చెల్లింపులు చేయనున్నారు.


ఈ డీఏ పెంపునకు సంబంధించి జీవో ఆలస్యంగా జారీ చేయడానికి ప్రధాన కారణం... సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటమే అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీఏ పెంపును పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వాగతిస్తున్నాయి.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 12:13 PM