IAS officers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:26 PM
పలువురు ఐఏఎస్ అధికారులను(IAS officers) బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా ఉత్తర్వులు జారీచేశారు.
చెన్నై: పలువురు ఐఏఎస్ అధికారులను(IAS officers) బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర పర్యాటక కమిషనర్, పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల ఉష గృహవసతి, నగర ప్రాంత అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శిగా గృహవసతి, నగర ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శి సమయమూర్తి పర్యాటక కమిషనర్గా బదిలీ అయ్యారు. ఈయన పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గాను వ్యవహరిస్తారు. రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక పథకాల అమలు శాఖ కార్యదర్శిగా ధారేష్ అహ్మద్ నియమితులయ్యారు. మళ్లీ ఉత్తర్వులిచ్చేంత వరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రధాన నిర్వహణ అధికారిగా అదనపు బాధ్యతలు వహిస్తారు.