Share News

విశ్వస నీయత కోల్పోయిన మోదీ: మమత

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:57 AM

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినందున నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత డిమాండు చేశారు. అ

విశ్వస నీయత కోల్పోయిన మోదీ: మమత

కోల్‌కతా, జూన్‌ 4: ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినందున నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత డిమాండు చేశారు. అయోధ్యలో ఓటమే ఇందుకు రుజువని వ్యాఖ్యానించారు. ‘‘ప్రఽధాని మోదీకి మెజార్టీ సీట్లు దక్కనందుకు సంతోషపడుతున్నా.

ఆయన విశ్వసనీయత కోల్పోయారు. 400కుపైగా సీట్లు సాధిస్తామంటూ ఆయన చెప్పిన మాట నిజం కానందున వెంటనే పదవికి రాజీనామా చేయాలి. మోదీ, అమిత్‌ షాలు ఎంతో సొమ్ము వెచ్చించినా ఇండియా కూటమి గెలిచింది’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 05 , 2024 | 05:57 AM