Share News

MHA: 14 రాష్ట్రాలకు వరద సాయంగా రూ.5,858 కోట్లు విడుదల చేసిన కేంద్రం

ABN , Publish Date - Oct 01 , 2024 | 08:40 PM

వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయక నిధులను మంగళవారంనాడు విడుదల చేసింది. రూ.5,858 కోట్లను విడుదల చేసినట్టు కేంద్ర హోం శాఖ అధికార ప్రకటనలో తెలిపింది.

MHA: 14 రాష్ట్రాలకు వరద సాయంగా రూ.5,858 కోట్లు విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయక నిధులను మంగళవారంనాడు విడుదల చేసింది. రూ.5,858 కోట్లను విడుదల చేసినట్టు కేంద్ర హోం శాఖ (MHA) అధికార ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి (SDRF)కి కేంద్ర వాటాగా జాతీయ విపత్తు సహాయ నిధి (NDRF) నుంచి ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది.


తెలంగాణకు రూ.416.80 కోట్లు, ఏపీకి రూ.1,036 కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి వరద సహాయ నిధిగా రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లను కేంద్రం విడుదల చేసింది. మహారాష్ట్రకు రూ.1,491 కోట్లు, అసోంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు,మిజోరాంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ.468 కోట్లు విడుదల చేసింది.

PM Modi: కులమతాల పేరుతో దేశ ఐక్యతకు కాంగ్రెస్ విఘాతం


నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల 14 రాష్ట్రాలు వరద ప్రభావానికి గురయ్యారు. కేంద్ర బృందాలు పర్యటించి ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా అడ్వాన్స్‌గా నిదులు విడుదల చేస్తున్నట్టు హోం శాఖ తాజా ప్రకటనలో పేర్కొంది.


మరిన్ని జాతీయ వార్తల కోసం

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..

Updated Date - Oct 01 , 2024 | 08:50 PM