Share News

Ooty: ఊటీ కొండ రైలుకు 125 వసంతాలు పూర్తి

ABN , Publish Date - Jun 16 , 2024 | 12:43 PM

నీలగిరి కొండ రైలు(Nilgiri hill train) 125 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ రైలు సేవలు 1899 జూన్‌ 15వ తేది మేట్టుపాళయం నుంచి కున్నూర్‌కు ప్రారంభమయ్యాయి. ఈ రైలును రూపొందించడానికి కారుకులైన బ్రిటీష్‌ పర్యవేక్షణ ఇంజనీర్‌ జెఎల్‌ఎల్‌ మోరంట్‌ను స్మరించుకొనేలా శనివారం 125వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Ooty: ఊటీ కొండ రైలుకు 125 వసంతాలు పూర్తి

చెన్నై: నీలగిరి కొండ రైలు(Nilgiri hill train) 125 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ రైలు సేవలు 1899 జూన్‌ 15వ తేది మేట్టుపాళయం నుంచి కున్నూర్‌కు ప్రారంభమయ్యాయి. ఈ రైలును రూపొందించడానికి కారుకులైన బ్రిటీష్‌ పర్యవేక్షణ ఇంజనీర్‌ జెఎల్‌ఎల్‌ మోరంట్‌ను స్మరించుకొనేలా శనివారం 125వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ... జెఎల్‌ఎల్‌ మోరంట్‌ ప్రపంచవ్యాప్తంగా రైళ్లు నడిపేందుకు కారణమైన రిగన్‌బాగ్‌ అనే వ్యక్తిని నీలగిరికి తీసుకొచ్చి ఈ రైలు తయారు చేయించారని, అయితే నిధుల కొరత కారణంగా ఈ పనులు ఆగిపోయాయని తెలిపారు. మళ్లీ రిగన్‌బాగ్‌ సహాయకుడు రోమన్‌అప్ట్‌ పనులు పూర్తిచేశారని తెలిపారు.

ఇదికూడా చదవండి: Udayanidhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం మాదే...


అలాగే, కున్నూర్‌లో ఉన్న రోమన్‌ క్యాథలిక్‌ చర్చి, వెల్లింగ్టన్‌ దేవాలయం, కూడలూరు ప్రొటెస్టెంట్‌ చర్చి, లారెన్స్‌ పాఠశాల, ఊటీ బొటానికల్‌ పార్క్‌(Ooty Botanical Park) వంటివి కూడా మోరంట్‌ నిర్మించారని పేర్కొన్నారు. 1886 జూన్‌ 17వ తేది ఆస్ట్రేలియాలో మృతిచెందిన మోరంట్‌ చిత్రపటం లభించకపోవడం దురదృష్టకరమన్నారు. అయినప్పటికీ, ఆయన పేరుతో ప్రతి ఏటా నీలగిరి కొండ రైలు వార్షిక వేడుకలు జరుపుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 12:43 PM