Share News

Narendra Modi: మళ్లీ విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

ABN , Publish Date - Aug 19 , 2024 | 08:47 PM

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఆగస్ట్ 21వ తేదీన ప్రధాని మోదీ పోలాండ్‌కు చేరుకోనున్నారు. అనంతరం ఆగస్ట్ 23న ఉక్రెయిన్‌లో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Narendra Modi: మళ్లీ విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఆగస్ట్ 19: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఆగస్ట్ 21వ తేదీన ప్రధాని మోదీ పోలాండ్‌కు చేరుకోనున్నారు. అనంతరం ఆగస్ట్ 23న ఉక్రెయిన్‌లో ఆయన పర్యటించనున్నారు.

Also Read: Jammu and Kashmir: ఉగ్రవాదుల మెరుపు దాడిలో సీఆర్పీఎఫ్ అధికారి మృతి

ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తమ దేశాల్లో పర్యటించాలని పోలాండ్ ప్రధాని డోనాల్డ్ డస్క్‌తోపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ నుంచి ప్రధాని మోదీకి ఆహ్వానం అందిందని పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఆ యా దేశాల నేతలతో కీలక చర్చలు జరుపుతారని పేర్కొంది.

Also Read: Kolkata College student: సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోస్ట్.. విద్యార్థి అరెస్ట్


దాదాపు 30 ఏళ్ల అనంతరం భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి అని గుర్తు చేసింది. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం కొనసాగుతుందని.. అలాంటి వేళ.. ఈ ఇరు దేశాలతో దౌత్యపరంగా, చర్చలు పరం భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఈ రెండు దేశాల మధ్య శాంతి స్థాపన నెలకొనాలని భారత్ ఆకాంక్షిస్తుందని స్పష్టం చేసింది.

Also Read: న్యూయార్క్‌లో ఘనంగా ఇండియా డే పరేడ్

Also Read: MUDA ’scam’: హైకోర్టు తలుపు తట్టిన సీఎం సిద్దరామయ్య

ఇక 45 ఏళ్ల అనంతరం పోలాండ్‌లో భారత ప్రధాని పర్యటిస్తున్నారని పేర్కొంది. భారత్, పోలాండ్ మధ్య దైపాక్షిక చర్యలు ప్రారంభమై 70 ఏళ్లయిందని పేర్కొంది. అలాంటి వేళ.. ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించకుందని వివరించింది. ఇది ఈ ఇరు దేశాలకు ఒక మైలురాయి అని గుర్తు చేసింది.

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం

Also Read: దారుణం.. రాఖీ కట్టి ఊపిరి వదిలిన అక్క


పోలాండ్‌లో 25 వేల మంది భారతీయులు ఉంటే.. వారిలో 5 వేల మంది విద్యార్థులు ఉన్నారని వివరించింది. ఇటీవల ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్దం జరిగిందని గుర్తు చేసింది. ఆ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న దాదాపు 4 వేల మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించడంలో పోలాండ్ కీలక పాత్ర పోషించిందని వివరించింది.

Also Read: MUDA scam: సీఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఉపశమనం

Also Read: JK Assembly polls 2024: మేనిఫెస్టో విడుదల చేసిన నేషనల్ కాన్ఫరెన్స్


అలాగే పోలాండ్‌తో భారత్ దశాబ్దాలుగా కొనసాగిస్తున్న స్నేహపూర్వక అనుబంధాన్ని ఈ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. రెండో ప్రపంచ యుద్ద సమయంలో పోలాండ్ మహిళలు, చిన్నారులకు భారత్ అందించిన సహాయ సహకారాల పట్ల పోలాండ్ నేటికి కృతజ్ఞత భావంతో ఉంటుందని స్పష్టం చేసింది.

Also Read: TGSRTC: బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ

Also Read: రాఖీ పండుగ రోజు ఆకాశంలో అద్భుత.. భారత్‌లో కనిపించనున్న సూపర్‌ మూన్‌

For Latest News and National News click here

Updated Date - Aug 19 , 2024 | 08:47 PM