Share News

Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:28 AM

పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.

Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి, ఛఠ్‌, దుర్గా పూజ పండుగల సందర్భంగా దాదాపు 6 వేల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శుక్రవారం ప్రకటించారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే 108 రైళ్లకు అదనంగా జనరల్‌ కోచ్‌లను జత చేశామని తెలిపారు. అంతేకాకుండా 12,500 కోచ్‌లను మంజూరు చేశామని వివరించారు.

Updated Date - Sep 28 , 2024 | 08:16 AM