Share News

Supreme Court: సుప్రీంకోర్టులో జేపీ వెంచర్స్‌కు చుక్కెదురు..

ABN , Publish Date - Aug 02 , 2024 | 01:23 PM

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపిన జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన 18 కోట్ల జరిమానా నుంచి విముక్తి కల్పించాలని జేపీ సంస్థ చేసిన విజ్ణప్తిని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.

Supreme Court: సుప్రీంకోర్టులో జేపీ వెంచర్స్‌కు చుక్కెదురు..

ఢిల్లీ: ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపిన జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన 18 కోట్ల జరిమానా నుంచి విముక్తి కల్పించాలని జేపీ సంస్థ చేసిన విజ్ణప్తిని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంలో విచారణ ఆగస్టు 31కి వాయిదా వేశారు. ఆ లోగా అదనపు అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. జులై 30వ తేదీన ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను క్షణ్ణంగా పరిశీలించి ఏమి చేయాలన్నది ఆదేశిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. వరదల కారణంగా అక్రమ ఇసుక తవ్వకాల ఆనవాళ్లు కొట్టుకుపోయాయన్నారు.


వాటిని తేల్చడానికి శాస్త్రీయ పద్దతుల్లో విచారణ చేపట్టాలనుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. శాస్త్రీయ అధ్యయనానికి సంబంధించి కొన్ని సంస్థలను సంప్రదించామని.. అన్నీ అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదిక అందించడానికి మూడు నెలలు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అక్రమ తవ్వకాలకు బాధ్యులైన ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని సస్పెన్షన్ విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపున వాదిచిన న్యాయవాది హుజేఫా అహ్మదీ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. 8 జిల్లాలలో మాత్రమే ఇసుక అక్రమ తవ్వకాలపై అధ్యయనం చేశామని, మిగతా జిల్లాలలో అధ్యయానికి మరింత సమయం కావాలని కేంద్ర కమిటీ కోరింది.


తదుపరి విచారణ ఆగస్టు 31 కి వాయిదా వేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో సుప్రీం సీరియస్ అయ్యింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరిగినట్లు కేంద్ర కమిటీ నిర్ధారించింది.

Updated Date - Aug 02 , 2024 | 01:23 PM