Share News

Lok Sabha Elections: కమలానికి జీవం పోసిన రాష్ట్రాలివే..

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:33 AM

గత ఎన్నికల్లో ఢిల్లీలోని 7 స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే ఊపును కొనసాగించి అన్నింటా గెలిచింది. అసోంలో 14 సీట్లకు గాను 2019లో బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 9 చోట్ల గెలిచింది.

Lok Sabha Elections: కమలానికి జీవం పోసిన రాష్ట్రాలివే..

న్యూఢిల్లీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): గత ఎన్నికల్లో ఢిల్లీలోని 7 స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే ఊపును కొనసాగించి అన్నింటా గెలిచింది. అసోంలో 14 సీట్లకు గాను 2019లో బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 9 చోట్ల గెలిచింది. ఈ సారి కూడా అదే సంఖ్యలో సీట్లను నెగ్గింది. ఛత్తీ్‌సగఢ్‌లో 11 స్థానాలకుగాను 10 సీట్లను కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో 29 స్థానాలు ఉండగా.. అక్కడ క్లీన్‌స్వీప్‌ చేసింది. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 26 స్థానాలకు గాను 25 చోట్ల గెలిచింది. మొత్తంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లో బీజేపీకి 61 సీట్లు రావడం ఆ పార్టీకి అతిపెద్ద ఊరటనిచ్చే అంశం.

Updated Date - Jun 05 , 2024 | 05:38 AM