Share News

Thiruvananthapuram : శాస్త్రవేత్తలపై ఆంక్షల ఉపసంహరణ

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:08 AM

వయనాడ్‌పై విపత్తు విరుచుకుపడిన వేళ... శాస్త్రవేత్తలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఆంక్షలు విధించడంపై కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

Thiruvananthapuram : శాస్త్రవేత్తలపై ఆంక్షల ఉపసంహరణ

తిరువనంతపురం, ఆగస్టు 2: వయనాడ్‌పై విపత్తు విరుచుకుపడిన వేళ... శాస్త్రవేత్తలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఆంక్షలు విధించడంపై కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇటీవల కొండచరియలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా నష్టపోయిన మెప్పటి పంచాయతీ పరిధిలో శాస్త్రవేత్తలు పర్యటించరాదని, ప్రమాదంపై ఎటువంటి అభిప్రాయాలు మీడియాతో వెల్లడించకూడదని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం గురువారం ఆదేశించింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో, ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని సీఎం విజయన్‌ శుక్రవారం ఆదేశించారు.

Updated Date - Aug 03 , 2024 | 05:09 AM