Share News

Lok sabha dissolution: 17వ లోక్‌సభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు

ABN , Publish Date - Jun 05 , 2024 | 02:20 PM

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో 17వ లోక్‌సభ రద్దుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారంనాడు సిఫారసు చేసింది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. మేదీ 2.0 చివరి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Lok sabha dissolution: 17వ లోక్‌సభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) ఫలితాలు వెలువడటంతో 17వ లోక్‌సభ (17th Lok Sabha) రద్దుకు ( Dissolution) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) బుధవారంనాడు సిఫారసు చేసింది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. మోదీ 2.0 చివరి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 17వ లోక్‌సభకు రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేయడంతో 18వ లోక్‌సభ ఏర్పాటుకు, కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టాడానికి మార్గం సుగమమవుతుంది.

Narendra Modi: మూడోసారి ప్రధానిగా మోదీ.. ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు!


ఎన్డీయే, 'ఇండియా' కూటమి నేతల సమావేశం

ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు ఇటు ఎన్డీయే, అటు ఇండియా(I.N.D.I.A.) కూటమి వేర్వేరుగా బుధవారం సమావేశమవుతున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు మోదీ నివాసంలో ఎన్డీయే నేతలు సమావేశం కానుండగా, సాయంత్రం 6 గంటలకు 'ఇండియా' కూటమి సమావేశం కానున్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రకటించారు.

For Latest News and National News Click Here

Updated Date - Jun 05 , 2024 | 02:20 PM