Amit Shah: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా

ABN, Publish Date - Jun 01 , 2024 | 10:48 AM

తిరుమల: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో సతీమణి సోనాల్‌ షాతో కలిసి ఆలయంలోకి వెళ్లి ధ్వజస్తంభం వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత శ్రీవారిని దర్శించుకున్న అనంతరం హుండీలో కానుకలు సమర్పించి, రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఈవో ధర్మారెడ్డి శ్రీరాములవారి చిత్రపటం, లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated at - Jun 01 , 2024 | 10:48 AM