TDP: చిత్తూరులో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు..

ABN, Publish Date - May 12 , 2024 | 01:48 PM

‘చిత్తూరు జిల్లా విభజన తర్వాత యూనివర్సిటీలన్నీ తిరుపతిలో ఉండిపోయాయి. జిల్లాలో ద్రవిడ వర్సిటీనే ఉంది. ఇక్కడ వర్సిటీనేకాదు ప్రతిష్ఠాత్మక కాలేజీలను నెలకొల్పి చిత్తూరును విద్యా కేంద్రంగా మారుస్తా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు నగరం మురకంబట్టు సర్కిల్‌ వద్ద శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. వర్సిటీయే కాదు.. ప్రతిష్టాత్మక కాలేజీలూ తెస్తా నని, అడవిపల్లె రిజర్వాయర్‌ నుంచి నగరానికి నీళ్లు తీసుకువస్తానని చెప్పారు. ఇక్కడే చివరి మీటింగ్‌ పెట్టాలనుకుని వచ్చానని చంద్రబాబు వెల్లడించారు.

 TDP: చిత్తూరులో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు.. 1/6

చిత్తూరులో శనివారం జరిగిన ప్రజాగళం సభకు విచ్చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు .. ప్రజలకు విక్టరీ సంకేతం చూపుస్తున్న దృశ్యం.

 TDP: చిత్తూరులో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు.. 2/6

చిత్తూరు నగరం మురకంబట్టు సర్కిల్‌ వద్ద శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ముగింపు సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..

 TDP: చిత్తూరులో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు.. 3/6

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడుతున్న దగ్గుమళ్ల, పక్కన గురజాల, సీకే బాబులను చూడవచ్చు.

 TDP: చిత్తూరులో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు.. 4/6

చంద్రబాబు శనివారం చిత్తూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో విజన్ 2024-29.. ఐదేళ్ల యాక్షన్ ప్లాన్ రూపొందించిన బుక్ లెట్‌ను చూపిస్తున్న టీడీపీ అధినేత..

 TDP: చిత్తూరులో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు.. 5/6

చిత్తూరులో శనివారం వర్షం పడుతున్నా.. ఆ చినుకుల్లోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాగళం రోడ్ షో నిర్వహిస్తున్న దృశ్యం..

 TDP: చిత్తూరులో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు.. 6/6

చిత్తూరు నగరం మురకంబట్టు సర్కిల్‌ వద్ద శనివారం చంద్రబాబు నిర్వహించిన ఎన్నికల ప్రచార ముగింపు సభకు భారీగా తరలివచ్చిన జనం..

Updated at - May 12 , 2024 | 01:48 PM