పోలీసు అమర వీరులకు సీఎం చంద్రబాబు ఘన నివాళి..

ABN, Publish Date - Oct 22 , 2024 | 11:12 AM

విజయవాడ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని.. అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రైమ్‌ రేట్‌ జీరోకు రావాలని, డ్రగ్స్‌, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడాలని చెప్పారు. పోలీసు అమరవీరుల స్థూపాన్ని అమరావతిలో నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సీఎస్‌ నీరబ్‌ కుమార్‌, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ముఖ్య అధికారులు పాల్గొని పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు.

Updated at - Oct 22 , 2024 | 11:12 AM