Nijam Gelavali: కడప జిల్లాలో భువనేశ్వరి పర్యటన
ABN, Publish Date - Apr 05 , 2024 | 11:26 AM
కడప: నిజం గెలవాలి పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కడప జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించి.. ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో మండుటెండను కూడా లెక్క చేయకుండా భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారన్నారు. వైసీపీ రాక్షసపాలనలో టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందని ఆమె విమర్శించారు. వైసీపీ చేసే ప్రతీ తప్పును చంద్రబాబుపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు. గంజాయి, ఇసుక, భూకబ్జాలు, కల్తీ మద్యం మాఫియా ముఠాలలో ఏపీని వైసీపీ ముందు వరుసలో నిలబెట్టిందని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated at - Apr 05 , 2024 | 11:26 AM