TDP: తూ.గో. జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు..

ABN, Publish Date - Apr 04 , 2024 | 11:00 AM

తూ.గో. జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంలో రోడ్ షో నిర్వహించారు. పసుపు, ఎరుపు, కాషాయ రంగులతో ఆ ప్రాంతం కళకళలాడింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులతో రోడ్ షో అదిరిపోయింది. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారరథంపై నుంచి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం అరాచకం, నీచరాజకీయాలు, వైఫల్యాలను ఎండగట్టారు.

TDP: తూ.గో. జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు.. 1/5

ప్రజాగళంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంకు వస్తున్న క్రమంలో అభిమానులు పూలవర్షం కురిపిస్తున్న దృశ్యం.

TDP: తూ.గో. జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు.. 2/5

తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంకు టీడీపీ అధినేత చంద్రబాబు విచ్చేసిన సందర్బంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన కూటమి నేతలు, కార్యకర్తలకు విక్టరీ సంకేతం చూపిస్తున్న చంద్రబాబు..

TDP: తూ.గో. జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు.. 3/5

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం సెంటర్‌లో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.

TDP: తూ.గో. జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు.. 4/5

ప్రజాగళంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంలో నిర్వహించిన రోడ్ షోకు తరలి వచ్చిన ప్రజానీకం..

TDP: తూ.గో. జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు.. 5/5

తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంకు వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మహిళా కార్యకర్తలు పూలు, హారతులతో స్వాగతం పలుకుతున్న దృశ్యం

Updated at - Apr 04 , 2024 | 02:03 PM