Share News

Delhi: జొమాటో ఆర్డర్‌లో బొద్దింక.. షాక్‌కి గురైన మహిళ ఏం చేసిందంటే

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:31 PM

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) ఆర్డర్‌లో బొద్దింక కనిపించడంతో ఓ వినియోగదారురాలు షాక్‌కి గురైంది. ఈ ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది. అగర్తలాలో నివసించే సోనాయ్ ఆచార్య ఇటీవల జొమాటో డెలివరీ యాప్‌లో జపనీస్ మిసో రామెన్ చికెన్‌ని ఆర్డర్ చేసింది.

Delhi: జొమాటో ఆర్డర్‌లో బొద్దింక.. షాక్‌కి గురైన మహిళ ఏం చేసిందంటే

ఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) ఆర్డర్‌లో బొద్దింక కనిపించడంతో ఓ వినియోగదారురాలు షాక్‌కి గురైంది. ఈ ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది. అగర్తలాలో నివసించే సోనాయ్ ఆచార్య ఇటీవల జొమాటో డెలివరీ యాప్‌లో జపనీస్ మిసో రామెన్ చికెన్‌ని ఆర్డర్ చేసింది. ఆర్డర్ ఓపెన్ చేసిన ఆమె అందులో బొద్దింక చనిపోయి ఉండటాన్ని గమనించింది. దాన్ని చూసిన షాక్‌కి గురై ఎక్స్ వేదికగా తన ఆవేదనను పంచుకుంది. చికెన్‌లో బొద్దింక ఉన్న ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. జొమాటోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలతో జొమాటో ఆడుకుంటోందని ఆమె ఆరోపించారు.

స్పందించిన జొమాటో..

సోనాయ్ ఆచార్య ఎక్స్ పోస్ట్‌పై జొమాటో యాజమాన్యం స్పందించింది. ఫుడ్‌కి అయిన రూ.320ని ఆమె ఖాతాకు రిఫండ్ చేసింది. జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేస్తున్నట్లు చెప్పింది. పరిస్థితులను చక్కదిద్దడానికి, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తామని వివరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 04:33 PM