Share News

Viral: భూమ్మిద నూకలు ఇంకా మిగిలుండటం అంటే ఇదే! షాకింగ్ వీడియో!

ABN , Publish Date - Oct 17 , 2024 | 06:23 PM

నేటి తరానికి సెల్‌ఫోన్ చేతుల్లో ఉందంటే చుట్టూ లోకం కనిపించదు .చివరకు ఊహించని ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఇందుకు తాజాగా ఉదాహరణగా మరో ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో చూసి జనాలు దడుసుకుంటున్నారు.

Viral: భూమ్మిద నూకలు ఇంకా మిగిలుండటం అంటే ఇదే! షాకింగ్ వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: నేటి తరానికి సెల్‌ఫోన్ చేతుల్లో ఉందంటే చుట్టూ లోకం కనిపించదు . దీంతో, ఊహించని ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు.ఈ తీరు ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో తెలిపే ఉదంతాలు ఎన్ని చూసినా కూడా ఆశించిన స్థాయిలో మార్పు రావట్లేదు. ఇందుకు తాజాగా ఉదాహరణగా మరో ఉదంతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో చూసి జనాలు దడుసుకుంటున్నారు. బ్రెజిల్‌లో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: వాహనదారుడికి షాకింగ్ అనుభవం! జోరు వానలో బయటకు రావద్దనేది ఇందుకే..


బ్రెజిల్‌లోని బ్యూనోస్ ఏరీస్ నగరంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి ఫోన్ చూసుకుంటూ రైల్వే క్రాసింగ్ వద్దకు వచ్చాడు. అప్పటికే అక్కడికి రైలు వస్తున్న విషయాన్ని అనేక మంది గమనించి పట్టాలు దాటకుండా అక్కడే నిలబడిపోయారు. కానీ ఫోన్ చూడటంలో మునిగిపోయిన ఆ వ్యక్తి రైలు రాకను గుర్తించలేక పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అక్కడ నిలబడ్డ ఓ మహిళ అతడి వాలకం చూసి షాకైపోయింది. తెలిసి చేస్తున్నాడో తెలీక చేస్తున్నాడో అర్థంకాక అతడిని వారించే విషయంలో తటపటాయించింది. మరోవైపు, ఆ వ్యక్తి మెల్లాగా పట్టాల మీదకు వచ్చాడు. మరో అడుగు వేసుంటే రైలు కింద పడుండేవాడే కానీ చివరి నిమిషంలో రైలు రాకను గుర్తించాడు. మెరుపు వేగంతో ఒక అడగు వెనక్కు వేసి పెను ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. కానీ వేగంగా వెనక్కు జరగడంతో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. బిత్తరపోయాడు.

Viral: తండ్రి హత్య! 25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం!


ఆ తరువాత ఎలాగొలా లేచి నిలబడినప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకునేందుకు అతడికి కొంత సమయం పట్టింది. కొంచెం ఉంటే ఎంతటి అనర్థం జరిగి ఉండేదో తలుచుకుని అతడు భయంతో చలనం లేకుండా నిలబడిపోయాడు. చుట్టుపక్కల వారు వచ్చి అతడికి పలకరిస్తే మెల్లగా సమాధానం ఇచ్చాడు. అయితే, రైలు డ్రైవర్ కూడా బ్రేకులు వేయడంతో వ్యక్తి ముందే రైలు ఆగిపోయింది.

ఇక పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు నెట్టింట బాట పట్టడంతో జనాలు షాకైపోతున్నారు. భూమ్మీద నూకలు ఇంకా మిగిలుండటమంటే ఇదేనేమో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం యువకుడిని తిట్టిపోశారు. ఈ తరం ఫోన్ మాయలో పడి జీవితాల్ని చేజేతులా నాశనం చేసుకుంటోందంటూ కామెంట్ చేశారు. రైలు అంత పెద్ద శబ్దం చేస్తూ వస్తున్నా అతడు చివరి వరకూ గుర్తించలేకపోవడం కొందరిని ఆశ్చర్యపరిచింది. చెవిలో ఇయర్ బెడ్స్ పెట్టుకుని ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్‌గా మారింది.

Viral: గ్రహాంతరవాసులు ఉన్నారు! త్వరలో శాస్త్రవేత్తల కీలక ప్రకటన!!

Read Latest and Viral News

Updated Date - Oct 17 , 2024 | 06:32 PM