Share News

Viral News: పెళ్లైన మహిళతో ఎఫైర్.. ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లగానే కథలో ట్విస్ట్

ABN , Publish Date - Jun 09 , 2024 | 09:01 AM

వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో దారుణాలు జరిగాయి. పచ్చని కాపురాలు కూలిపోవడమే కాదు.. హత్యలు చోటు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు ఓ యువకుడు..

Viral News: పెళ్లైన మహిళతో ఎఫైర్.. ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లగానే కథలో ట్విస్ట్
Man Killed Over Love Affair

వివాహేతర సంబంధాల (Extramarital Affairs) కారణంగా ఎన్నో దారుణాలు జరిగాయి. పచ్చని కాపురాలు కూలిపోవడమే కాదు.. హత్యలు చోటు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు ఓ యువకుడు కూడా ఈ వివాహేతర బంధానికి బలి అయ్యాడు. పెళ్లయిన మహిళతో ప్రేమాయణం నడిపించి, తన చావుని తానే కొని తెచ్చుకున్నాడు. సాయంత్రం ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లిన అతను శవమై తేలాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బీహార్‌లోని కైమూర్ జిల్లా బెలావన్ గ్రామంలో పంకజ్ కుమార్ అనే 23 ఏళ్ల యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సరుకులు తీసుకురావడం కోసం అతను మార్కెట్‌కు వెళ్లాడు. అంతే.. ఆ తర్వాత అతను మళ్లీ తిరిగి రాలేదు. సరుకులను ఓ చిన్నారి ఇంటికి తీసుకొచ్చింది కానీ, పంకజ్ మాత్రం ఇంటికి వెళ్లలేదు. బహుశా స్నేహితుల వద్ద ఉంటాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే.. రాత్రయినా పంకజ్ ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అతని కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ.. ఎంత గాలించినా అతని ఆచూకీ లభించలేదు.


కట్ చేస్తే.. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు సోనారా గ్రామంలోని ఓ ఆలయం వద్ద పంకజ్ మృతదేహం స్థానికులకు కనిపించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. వాళ్లు వెంటనే అక్కడికి చేరుకున్నారు. విగతజీవిగా పడివున్న పంకజ్‌ని చూసి వాళ్లు కన్నీరుమున్నీరు అయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు వెంటనే రంగంలోకి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. పెళ్లైన యువతితో పంకజ్‌కు ఎఫైర్ ఉందని, ఆమె కుటుంబ సభ్యులే అతడిని చంపి ఉంటారని వాళ్లు ఆరోపించారు.

బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా.. వాళ్లు ఆరోపించినట్లుగానే ఈ హత్యలో ఎఫైర్ కోణం ఉందని పోలీసులు తేల్చారు. దీంతో అధికారులు ఇద్దరు అనుమానుతుల్ని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో పంజక్‌ను గొంతుకోసి చంపేశారని, ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jun 09 , 2024 | 09:01 AM