Share News

UP: భర్త ఆయుష్షు కోసం రోజంతా ఉపవాసం.. రాత్రికి విషం పెట్టి హత్య!

ABN , Publish Date - Oct 21 , 2024 | 08:01 PM

కర్వా చౌత్ సందర్భంగా భర్త కోసం రోజంతా ఉపవాసం ఉన్న మహిళ ఆ రాత్రే అతడికి విషమిచ్చి చంపిన షాకింగ్ ఘటన యూపీలో వెలుగు చూసింది. భర్తపై అనుమానంతోనే ఆమె ఈ హత్యకు పాల్పడినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

UP: భర్త ఆయుష్షు కోసం రోజంతా ఉపవాసం.. రాత్రికి విషం పెట్టి హత్య!

ఇంటర్నెట్ డెస్క్: తన భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ మహిళ రోజంతా ఉపవాసం ఉంది. కానీ, సాయంత్రం దీక్ష ముగియగానే భర్తకు విషమిచ్చి మట్టుపెట్టింది. ఉత్తరాది మహిళలు జరుపుకునే కర్వా చౌత్ నోము నాడే వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది (Viral).

Viral: షాకింగ్! కోడి గుడ్డు కనబడగానే ఈ పాము ఎలా రెచ్చిపోయిందో చూడండి.


ఉత్తరప్రదేశ్‌లో కౌశాంబి జిల్లాలోని కడాధామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శైలేష్ అనే వ్యక్తిని అతడి భార్య సవిత కర్వా చౌత్ రోజునే విషం పెట్టి చంపేసింది. ఆదివారం ఆమె భర్త కోసం ఉపవాస దీక్ష చేపట్టింది. ఇందుకు కోసం కావాల్సిన ఏర్పాట్లను స్వయంగా భర్తే చేశాడు. పూజకు కావాల్సినవన్ని సమకూర్చాడు. సాయంత్రం సవిత యథాప్రకారం ఉపవాస దీక్ష ముగించింది. ఆ తరువాత భార్యాభర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. గొడవ త్వరగానే సద్దుమణగడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం ముగించారు. అంతకుముందే ఆమె విషయం కలిపిన మాకరోనీని భర్తకు పెట్టింది. భోజనం తరువాత పొరిగింటి వారిని కలిసి వస్తానని చెప్పి అటునుంచి అటే ఉడాయించింది.

Viral: పైల్స్‌తో నరకం! లీవ్ కోసం ప్రూఫ్ కావాలని మేనేజర్ ఉద్యోగిని అడగడంతో..

ఆ తరువాత కొద్ది సేపటికే శైలేష్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, చనిపోయే ముందు శైలేష్ తన వాంగ్మూలాన్ని వీడియోలో రికార్డు చేసుకున్నాడు. భార్యే తనకు విషయం పెట్టిందని చెప్పాడు. శైలేష్ ఆకస్మిక మరణంతో షాకైపోయిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Viral News: పెళ్లి చేసుకునేందుకు 2 రోజులు సెలవు అడిగితే తిరస్కరించిన సీఈవో.. కారణం ఏంటో తెలుసా?


మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేశారు. ఆ తరువాత కొద్ది గంటలకే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్ మార్టం నివేదిక అనంతరం చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే, భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని కూడా చెప్పారు. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని నిందితురాలు ఆరోపించేదని, ఈ విషయంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Read Latest and Viral News

Updated Date - Oct 21 , 2024 | 08:13 PM