Share News

Womens T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో బోణి కొట్టిన ఆస్ట్రేలియా.. డేంజర్ జోన్‌లో శ్రీలంక

ABN , Publish Date - Oct 05 , 2024 | 08:37 PM

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్‌కు వెళ్లే మార్గం ఇప్పుడు శ్రీలంక జట్టుకు చాలా కష్టంగా మారింది.

 Womens T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో బోణి కొట్టిన ఆస్ట్రేలియా.. డేంజర్ జోన్‌లో శ్రీలంక
Australia beat Sri Lanka

యూఏఈలో మహిళల టీ20 ప్రపంచకప్‌ జరుగుతోంది. టోర్నీలో 5వ మ్యాచ్ ఆస్ట్రేలియా, శ్రీలంక మహిళల జట్టు మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ ఓటమితో శ్రీలంక జట్టు దాదాపు సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. 2024 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి మ్యాచ్. ఈ క్రమంలో చాలా సులభంగా విజయం సాధించారు. ఆస్ట్రేలియా విజయంలో వారి బౌలర్ల పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. షార్జా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.


మ్యాచ్ ఎలా జరిగిందంటే..

ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడారు. దీంతో మొత్తం మ్యాచ్‌లో ఆ జట్టు రన్ రేట్ భారీగా తగ్గిపోయింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో కేవలం రెండు ఫోర్లు మాత్రమే కొట్టారు. ఈ మ్యాచ్‌లో పిచ్ చాలా స్లోగా ఉన్నప్పటికీ టీ20 మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్స్ నుంచి స్లో ఇన్నింగ్స్‌లు ఆశించలేం. శ్రీలంక తరఫున నీలాక్షి డిసిల్వా అత్యధికంగా 29 పరుగులు చేసింది. అందుకోసం 40 బంతులు ఎదుర్కొంది.


కొన్ని పరుగులతో

ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 94 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కూడా చాలా కష్టాల్లో పడింది. కేవలం 35 పరుగుల స్కోరు వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ బెత్ మూనీ ఒక ఎండ్ నుంచి గట్టిగా నిలబడింది. ఎలిస్ పెర్రీ, అథెల్ గార్డనర్‌లతో కలిసి, ఆమె జట్టును క్లిష్ట పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చింది. ఆ క్రమంలో ఈ మ్యాచ్‌లో మూనీ 38 బంతుల్లో 43 పరుగులతో ఇన్నింగ్స్ ఆడింది. దీంతో ఆస్ట్రేలియా 14.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి విజయం సాధించింది.


శ్రీలంక నిష్క్రమణ

ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ఓటమి కారణంగా మహిళల టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సెమీఫైనల్‌కు దూరమయ్యే ప్రమాదం బాగా పెరిగింది. ఈ జట్టు ఇక్కడ నుంచి కూడా సెమీ ఫైనల్‌కు చేరుకోగలిగినప్పటికీ, దాని కోసం వారు తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. కాగా శ్రీలంక జట్టు నాలుగో స్థానానికి చేరుకుంది.


ఇవి కూడా చదవండి:

Womens T20 World Cup 2024: రేపే భారత్ vs పాకిస్తాన్ కీలక మ్యాచ్.. ఎవరు గెలుస్తారంటే..


Suryakumar Yadav: అక్టోబర్ 6 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ టీ20.. అరుదైన ఫీట్ చేరువలో సూర్యకుమార్‌ యాదవ్..

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు


Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 05 , 2024 | 08:39 PM