Breaking News: వారాహి డిక్లరేషన్లో ముఖ్యాంశాలు ఇవే
ABN , First Publish Date - Oct 03 , 2024 | 09:26 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-10-03T18:54:08+05:30
వారాహి డిక్లరేషన్లో ముఖ్యాంశాలు
ఏ మతానికి, ఏ ధర్మానికైనా భంగం వాటిల్లినా ఒకేలా స్పందించేలా లౌకికవాదాన్ని పాటించాలి.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగచేసే చర్యలను అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాలి
చట్టాన్ని అమలుచేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏడాది నిధులు కేటాయించాలి.
ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతను దృవీకరించే విధానాన్ని తీసుకురావాలి
ఆలయాలు కేవలం అథ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా విద్యా, కళా కేంద్రాలుగా, ఆర్తిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలి
-
2024-10-03T18:53:32+05:30
వారాహి సభలో పవన్ కళ్యాణ్
పార్టీలకు అతీతంగా భారత దేశ సమాజమంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే గొంతై వినిపించాలి
ప్రాంతీయ అసమానతలు లేకుండా సనాతన ధర్మాన్ని గౌవరించేవాళ్లు ఐక్యం కావాలి
-
2024-10-03T18:40:02+05:30
వారాహి సభలో పవన్ కళ్యాణ్
సనాతన ధర్మాన్ని పాటించేవాడు మత వివక్ష చూపించడు
నా ధర్మాన్ని ఎవరూ విమర్శించవద్దు
కౌలు రైతులకు సహాయం చేసేటప్పుడు మతం చూడలేదు
క్రైస్తవులు, ముస్లిం రైతులకు సహాయం చేశాను
జగన్కు 11 సరిపోలేదు
ఈసారి ఎన్నికల్లో జగన్ను ఒక సీటుకు పరిమితం చేద్దాం
-
2024-10-03T18:37:34+05:30
వారాహి సభలో పవన్ కళ్యాణ్
సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కడికి చులకనగా మారింది
సనాతన ధర్మంపై దాడి చేస్తే దేశంలో సెక్కులరిస్టులు స్పందించరు
ఇతర మతాలపై దాడి చేస్తే దేశ వ్యాప్తంగా అంతా స్పందిస్తారు
ఇతర మతాలపై దాడి చేస్తే అన్ని కోర్టులు స్పందిస్తాయి
సనాతన ధర్మంపై దాడి జరిగితే ఎవరూ స్పందించరు
సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి అంతా ఐక్యం కావాలి
శ్రీరాముడిని దేశమంతా పూజిస్తుంది..
అదే శ్రీరాముడిని చెప్పులతో కొడితే మౌనంగా ఉంటాం
రాముడిపై అసత్య ప్రచారాలు చేసినా మౌనంగా ఉంటాం
దేశ మూల సంస్కృతికి వెన్నుముక శ్రీరాముడు
రాముడు ఉత్తరాది వాడా
రాముడికి ప్రాంతం ఉంటుందా
కొందరు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కొత్త సిద్దాంతాలు తెరపైకి తెస్తున్నారు
ఉదయ్నిధి స్టాలిన్పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సనాతన ధర్మాన్ని వైరస్తో పోలుస్తారా
-
2024-10-03T18:25:16+05:30
వారాహి సభలో పవన్..
సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే తన లక్ష్యమన్న పవన్
సనాతన ధర్మంతోనే తన జీవితం ముడిపడిఉందన్న పవన్
అన్ని మతాలను గౌరవిస్తా
నేను హిందువుని
ధర్మం కోసమే ఇప్పటివరకు నిలబడ్డా
ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు
అన్ని మతాలను సమానంగా చూస్తా
నా కుమార్తె తిరుమలకు తీసుకెళ్లినందుకు డిక్లరేషన్ ఇప్పించా
తిరుమలలో నా చిత్తశుద్ధిని చూపించా
నన్ను విమర్శించే వాళ్లు ఒకటే గుర్తించుకోండి
పరాజయాలు పొందినా వెనక్కి తగ్గను
సనాతన ధర్మంపై పూర్తి విశ్వాసం ఉంది
సనాతన ధర్మాన్ని వైరస్ అంటున్నారు
సనాతన ధర్మాన్ని ఖతం చేస్తామంటున్నారు
-
2024-10-03T18:17:50+05:30
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన రకుల్ ప్రీత్ సింగ్
బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళ నిరాధార ఆరోపణలు చేయడం బాధకరమన్న రకుల్
పొలిటికల్ మైలేజీ కోసం తన పేరు ఉపయోగించవద్దన్న రకుల్ ప్రీత్ సింగ్
తాను పూర్తిగా రాజకీయ వ్యతిరేకినన్న రకుల్
తనకు ఏ రాజకీయపార్టీతో సంబంధాలు లేవన్న రకుల్ ప్రీత్ సింగ్
కల్పిత కథలను ఆపేయాలని పిలుపు
-
2024-10-03T17:18:49+05:30
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన అక్కినేని నాగార్జున..
అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాంపల్లి కోర్టులో గురువారం కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు.
తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు.
-
2024-10-03T13:24:10+05:30
అమ్మవారి సేవలో తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పండితులు
దేవీ నవరాత్రుల సందర్భంగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్
తొలిరోజు బాలా త్రిపురసుందరిదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
-
2024-10-03T12:25:38+05:30
దుర్గమ్మకు నాలుగు కోట్ల విలువైన బంగారు వజ్ర ఆభరణాలు.
దసరా ఉత్సవాల్లో రేపటినుంచి వజ్రకిరీటంతో అమ్మవారు దర్శనం
మూడు కోట్ల విలువ అయిన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం
కిరీటం అందజేసిన ముంబైకి చెందిన సౌరభ్ గౌర్
సూర్య, చంద్ర ఆభరణాలు అందజేసిన కడపకు చెందిన సీఎం రాజేష్
వజ్రాలు పొదిగిన ముక్కెర, నత్తు, బులకీ, కర్ణభరణాలు అందజేసిన..
పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి
-
2024-10-03T12:10:42+05:30
కొండా సురేఖపై నాగార్జున న్యాయ పోరాటం
ప్రస్తుతం వైజాగ్లో ఉన్న నాగార్జున
హైదరాబాద్ రాగానే సురేఖకు లీగల్ నోటీస్
నోటీసుపై లాయర్లతో చర్చ
రాజకీయ నాయకులు దృష్టిని ఆకర్షించేందుకు సెలబ్రిటీల పేర్లను ఉపయోగించే సంస్కృతిని ఆపాలి
తెలుగు ఇండస్ట్రీ మొత్తం నా కుటుంబానికి మద్దతుగా ముందుకు వచ్చింది: నాగార్జున
-
2024-10-03T11:29:07+05:30
జానీ మాస్టర్కు బెయిల్ మంజూరు
జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు
-
2024-10-03T09:31:04+05:30
చిరంజీవి కామెంట్స్
హైదరాబాద్: చై-సామ్పై మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించింది.
సెలబ్రిటీలు, సినీ సోదరులపై కామెంట్స్ చేసి ఫేమస్ అవాలనుకోవడం సరికాదు
మా సభ్యులపై మాటల దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు హుందాగా ఉండాలి.
-
2024-10-03T09:26:07+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.