Share News

Phone Abuse: మంత్రి సీతక్కకు ఫోన్లో దూషణలు

ABN , Publish Date - Sep 07 , 2024 | 03:42 AM

మంత్రి డి.అనసూయ(సీతక్క)కు పదే పదే ఫోన్‌ చేసి అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై పంజాగుట్ట పోలీస్‌స్టే షన్‌లో కేసు నమోదు అయ్యింది.

Phone Abuse: మంత్రి సీతక్కకు ఫోన్లో దూషణలు

  • పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు

పంజాగుట్ట, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మంత్రి డి.అనసూయ(సీతక్క)కు పదే పదే ఫోన్‌ చేసి అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. బేగంపేట జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌ ఆవరణలోని ఓ భవనంలో మంత్రి అనసూయ నివాసం ఉంటున్నారు. ఈ నెల 4న గుర్తు తెలియని వ్యక్తి సాయంత్రం 4.03, 4.05, 4.56 గంటల ప్రాంతంలో మంత్రి మొబైల్‌కు ఫోన్‌ చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. ఆమె సూచనతో కారు డ్రైవర్‌ ఎం.శ్రీను పంజాగుట్ట పీఎ్‌సలో ఫిర్యాదు చేశాడు.మొబైల్‌ నెంబర్‌ ఆధారంగా నిందితుణ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Updated Date - Sep 07 , 2024 | 03:42 AM