Share News

TS News: వికారాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘర్షణ

ABN , Publish Date - Feb 22 , 2024 | 09:04 AM

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో అర్థరాత్రి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. శివాజీ విగ్రహం, అంబేడ్కర్ భవనం ఏర్పాటు విషయంలో గ్రామంలోని ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.

TS News: వికారాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘర్షణ

వికారాబాద్: వికారాబాద్ (Vikarabad) జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో అర్థరాత్రి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. శివాజీ విగ్రహం, అంబేడ్కర్ భవనం ఏర్పాటు విషయంలో గ్రామంలోని ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. శివాజీ విగ్రహం (Shivaji Statue) ఏర్పాటు కోసం ఓ వర్గం భూమి పూజ చేసింది. అక్కడ శివాజీ విగ్రహం పెట్టొదని మరో వర్గం వాదిస్తోంది. అంబేడ్కర్ భవనం కోసం గతంలో ఆ భూమి కేటాయించారని వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల ముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం జరిగింది. గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసులు మోహరించారు.

Updated Date - Feb 22 , 2024 | 09:04 AM