Share News

CM Revanth Reddy: జర్నలిస్టు సూర్యప్రకాశ్‌కు అండగా సీఎం రేవంత్‌

ABN , Publish Date - Sep 17 , 2024 | 02:46 AM

తీవ్ర అనారోగ్యానికి గురై ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ జర్నలిస్టు కేవీఎన్‌ఎ్‌స సూర్యప్రకాశ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి అండగా నిలిచారు.

CM Revanth Reddy: జర్నలిస్టు సూర్యప్రకాశ్‌కు అండగా సీఎం రేవంత్‌

  • వైద్య ఖర్చులకు రూ.10 లక్షలు మంజూరు

  • నేడు చెక్కు అందజేయనున్న అధికారులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తీవ్ర అనారోగ్యానికి గురై ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ జర్నలిస్టు కేవీఎన్‌ఎ్‌స సూర్యప్రకాశ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి అండగా నిలిచారు. వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఢిల్లీలో ఓ దినపత్రిక జర్నలిస్టుగా సూర్యప్రకాశ్‌ కొంతకాలంగా పనిచేస్తున్నారు. అయితే ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడంతో తీవ్ర అనారోగ్యం పాలై మూడ్రోజుల క్రితం మ్యాక్స్‌ ఆస్పత్రిలో చేరారు.


ఆయన పరిస్థితిని తెలుసుకున్న సీఎం రేవంత్‌ తక్షణమే స్పందించారు. సూర్యప్రకాశ్‌ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు ఇందుకు సంబంధించిన చెక్కును మంగళవారం ఢిల్లీలో సూర్యప్రకాశ్‌ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.

Updated Date - Sep 17 , 2024 | 02:46 AM