Share News

CM Revanth Reddy: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సీఎం రేవంత్‌

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:39 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు శుక్రవారం వచ్చారు.

CM Revanth Reddy: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు శుక్రవారం వచ్చారు. సుమారు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సీఎం అక్కడికి చేరుకున్నారు. సీఎస్‌ శాంతి కుమారి ఇతర అధికారులు సీఎం వెంట ఉన్నారు. కాగా, సీఎం కమండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్న సమయంలో సీపీ అనంద్‌ బషీర్‌ బాగ్‌లోని పాత సీపీ కార్యాలయంలో ఉండగా, డీజీపీ జితేందర్‌ సైతం తన కార్యాలయంలోనే ఉన్నారు. అయితే సీపీ, డీజీపీ విఽధుల్లో బిజీగా ఉండటం వల్లే సీఎం వెంట కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వెళ్లలేదని సమాచారం.

Updated Date - Oct 19 , 2024 | 03:39 AM